Sunday 9 October 2011

తొలి అరుణ కిరణం  మాయామాళవగౌళంలో
అవరోహణను  విన్పిస్తూ భువికి దిగుతోంది ...
జలపాతం నుంచి కిందికురికే  సంతత ధారలో  ఒక బిందువు
ఎగిరి వెళ్ళి కిరణంతో కలిసింది ...............
వెచ్చటి కిరణం ,జీవమిచ్చే  జలకణంతో
సంగమించినది .
ప్రాణానల  సంయోగమే కదా నాదం ..

శా రద కచ్ఛపి  కొత్త గమకాన్ని పలికింది ,
విరించి  కళ్ళేగుర  వేసాడు.
నా రాగం  నీ భావం  అంది వాణి చిరునవ్వు ,
తల పంకించి  కిందికి  చూసాడు విరించి ........
సృష్టి,దృష్టి నిరంతరం పరిణామం చెందక  తప్పదు ..
పచ్చని  ప్రకృతి,, అనంత నీలి సాగరం ,,
ఆహ్లాదకర వాతావరణం----,  -----
నవీనత కోసం ఏర్పాటుఆయిన మబ్బుల  సింహాసనం ,,,,
వచ్చే అతిధి  ఎవరో ?????

కాని ,,,
సర్వ సన్నాహాలు జరిగి పోతున్నాయి .
కచ్ఛపి తంత్రులు పలికే రాగం ,మిశ్రరాగంగా  రూపొందింది .
అందులోనూ సంగతులు జంట స్వరాలై  కులికాయి ,.
రాగాన్ని  వింటున్న విరించి చూపులు
మిథున రూపాన్ని  రచించాయి.
పులకరించిన ప్రకృతి పూల వర్షాన్ని  కురిపించింది..
సహకారం ,మమకారం సహజీవనమైనాయి ....

విశ్వం  తన పరిధిని  విశాలం  చేసుకుంది ........ 

No comments:

Post a Comment